రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి.

రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి.

ముద్ర ,లక్షేట్టిపేట :ప్రజలను మోసం చేస్తున్న రేషన్ డీలర్ల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ వాసులు లక్షేట్టిపేట తహసీల్దార్ జ్యోత్స్నా కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఉత్కూర్ వాసులు మాట్లాడుతూ..  డీలర్ షాప్ నెంబర్ 20 లో డీలర్ గోనేసంచి తోనే బియ్యం వేస్తున్నాడన్నారు. అలా తూకం వెయ్యడం వలన ప్రతి కుటుంబానికి అరకిలో బియ్యం తక్కువ రావడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎంత మొత్తుకున్న మోసం చేసిన బియ్యన్ని అతడు మాత్రం  ఏదేచ్ఛగా అమ్ముకుంటున్నాడని, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా తహసీల్దార్ మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో దర్శనాల నవీన్ కుమార్. కళ్లేపల్లి విక్రమ్. ముప్పు లక్ష్మణ్. దర్శనాల వంశీ తదితరులు పాల్గొన్నారు.