బైకు ను ఢీ కొట్టిన ప్రయివేట్ బస్సు.. 

బైకు ను ఢీ కొట్టిన ప్రయివేట్ బస్సు.. 
  • తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోని మాటేడు శివారులో శనివారం బస్సు బైకును ఢీకొన్న సంఘటనలో బైక్ పై ప్రయాణం చేస్తున్న తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.  స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేష్(27) అతని కుమారుడు తేజు(5) తో కలిసి ద్విచక్రవాహనంపై  తొర్రూర్ లో తమ సమీపబంధువుల ఇంట్లో జరుగుతున్న వేడుకకు ఉదయం బయలుదేరి వెళ్లారు.

అక్కడ భోజనం చేసిన అనంతరం, తిరిగి గుండంరాజుపెల్లి గ్రామానికి కి వస్తుండగా మాటేడు సమీపంలో ఓ.. ప్రైవేట్ బస్సు బైకును ఢీకొట్టింది. డీకొట్టిన బస్సు ఆ..బైక్ ను వీరిద్దరితోపాటు  కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. దీంతో బైక్ పై ఉన్న తండ్రి హరీష్, కొడుకు తేజు ఇద్దరు అక్కడికక్కడే మరణించడంతోపాటు,  వారి దేహాలు చిద్రమయ్యాయి. వీరితోపాటు తొర్రూర్ లో అదే వేడుకకు హాజరై వస్తున్న వీరి బంధువులు వెంటనే ఘటనాస్థలంకు  చేరుకొని బోరున విలపించారు. మహేష్, అతని కుమారుని అకాల మరణంతో గుండంరాజుపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. తొర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..