గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం

గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి... ఒకరి పరిస్థితి విషమం 

హుజూర్ నగర్, ముద్ర ప్రతినిధి: డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ప్రమాద సంఘటన బుధవారం గోపాలపురం గ్రామ వద్ద జరిగింది. గరిడేపల్లి మండలం వెంకట రామ పురానికి చెందిన కుర్ర సైదులు పాప శ్రీజ, మరొక వ్యక్తి  హుజూర్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కుర్ర సైదులు, పాప శ్రీజ మృతి చెందారు. తీవ్రగాయాలు అయిన మరొక వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.