రోడ్లు మరమ్మత్తులు చేయాలి
రేగొండ, ముద్ర: నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని చెరువులు , కుంటలు, బుగులోని జాతరకు వెళ్లే రోడ్లు తెగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు చేయాలని సీపీఐ, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాయి. ఆ పార్టీల యూత్ నాయకులు గురువారం చెరువులు, రోడ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, గ్రామ యూత్ నాయకుడు సిరపురం శివ మాట్లాడుతూ రేగొండ నుండి భూపాలపల్లి కి వెళ్లే జాతీయ రహదారి తిరుమలగిరి ఆర్చి నుండి శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రాంతం వరకు సుమారుగా ఆరు చోట్ల తెగిపోయిందని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందోన్నారు. జూబ్లీ నగర్ రోడ్డు నుండి పాండవుల గుట్ట మీదగా బొగులోని జాతర ప్రాంతం వరకు వెళ్లే రహదారి కూడా తెగిపోవడంతో బొగులోని జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలుగుతోందని అన్నారు.