పారిశుధ్య కార్మికునిగా మారిన సర్పంచ్...
![పారిశుధ్య కార్మికునిగా మారిన సర్పంచ్...](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b4e4e6aeb22.jpg)
ముద్ర, గంభీరావుపేట: పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడంతో గ్రామాల్లోని చెత్తా ఎక్కడికక్కడ పేరుకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు పారిశుధ్య కార్మికుడిగా అవతరమెత్తాడు. సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు తానే పారిశుధ్య కార్మికుడిగా మారి ట్రాక్టర్ నడుపుతూ వీధి వీధి తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సమ్మెతో కొద్ది రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ చెత్తను సేకరించి తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ను పలువురు అభినందించారు.