సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించాలి

సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించాలి

సారంగాపూర్ ముద్ర:  గతకో కొంతకాలంగా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారంగాపూర్ మండల ఫోరం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 14 నెలల నుండి గ్రామపంచాయతీలకు ప్రతి నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు ఇవ్వడం లేదని దీంతో గత నవంబర్ నెల నుండి ఎస్టివో బిల్లులు   పాస్ కావడం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వారం రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శుల ను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమ్మె చేయడం వలన గ్రామాల్లో కార్యదర్శులు లేక ఇబ్బందులు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని సంజయ్ కుమార్ ను కోరారు. సర్పంచుల నిధులు విషయంతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సంజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ రామారావు, కొండ శ్రీలత, వెంకటేష్, రమేష్, ఎడమల జయ ,ప్రేమానందం, జమున, రాజేశ్వరి ,అజ్మీర శ్రీలత పాల్గొన్నారు.