ఎస్ సి వర్గీకరణ చేపట్టాలి
- ఎం ఆర్ పి ఎస్ 29 వ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముద్ర న్యూస్ రేగొండ:-రేగొండ మండల కేంద్రంలో M.R.P.S 29వ ఆవిర్బావ ధీనోత్సవ వేడుకలు చిలివేరు సంపత్ మైసా రమేష్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. MRPS జెండాను మండల అధ్యక్షులు చిలువేరు సంపత్, ఎగరవేశారు ఈ కార్యక్రమని ఉద్దేశించి MRPS రాష్ట్ర నాయకులు మైసా రమేష్, మరియు చిలువేరు సంపత్ లు మాట్లాడుతూ. ఎస్సీ ల ను ABCD లు గా వర్గీకరణ చేపట్టి చట్ట బద్రత కలిపించవలసిందిగా డిమాండ్ చేసారు. శనివారం వరంగల్ కు భరత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. సభలో ఎస్ సి. లను ABCD లుగా జరగబోయే సభలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడతామని హామీ ఇచ్చి మాట ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం అన్నారు. వరంగల్ సభలో ప్రధాని మాట ఇవ్వని యెడల సభను అడ్డుకొని నిరసన తెలుపుతమని హెచ్చరించారు. మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో MRPS నాయకులు కలసి వర్గీకరణ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైసా విరాజ్, గజ్జెల పైడయ్య, మైసా బాదుషా, ఆలూరి వినయ్, మైసా పృద్వీరాజ్, మైసా రాజశేఖర్, అరికిల్ల సాయికృష్ణ ,తధితరులు పాల్గొన్నారు.