మరో పోరాటానికి సిద్ధమవుతాం

మరో పోరాటానికి సిద్ధమవుతాం

రామకృష్ణాపూర్, ముద్ర: కాంట్రాక్ట్ కార్మికులకు 7 తేదీన చెల్లించే  వేతనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్.సి.కే.ఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం మందమర్రి డివిజన్ పరిధిలోని రామకృష్ణాపూర్ ఏజోన్ సివిక్ కార్మికులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, సరైన తేదీలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కార్మికులందరిని ఐక్యం చేసి మరో పోరాటానికి పిలుపునిస్తానని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రవి,సంపత్,శారద,స్వరూప,రాజేశ్వరి,వెంకటస్వామి,రాజేందర్,అరుణ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.