సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుకున్న ప్రజలు -  ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ 

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుకున్న ప్రజలు -  ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ 

ముద్ర, షాద్‌నగర్ : ప్రభుత్వం అమలు  చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతుండడం మంచి పరిణామం అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ మూడోసారి కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

సోమవారం షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అంజయ్య పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతుండడం మంచి పరిణామం ఆయన అన్నారు.అన్నీ వర్గాల ప్రజల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమలతో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.

కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ లో చేరిన వారిలో పోలేపోగు శ్రీకాంత్, శేఖర్, సాయి, శివ శంకర్, మహేష్, జంగయ్య, కాశన్న, చంద్రయ్య, రాజు, పెబ్బే రాజు, శ్రీశైలం, బాలయ్య, రామయ్య, పెంటయ్య, వెంకటయ్య, బాబయ్య, జనార్ధన్, ప్రసాద్, సాయికుమార్, శీను, రజనీకాంత్, ఎల్లయ్య, రాములమ్మ, మహేందర్, భామేష్, రాజు, చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.