సిరిసిల్ల డీఈవో రాధాకిషన్ బదిలి

సిరిసిల్ల డీఈవో రాధాకిషన్ బదిలి
రాధాకిషన్. సిరిసిల్ల డీఈవో.

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మెదక్ జిల్లా విద్యాధికారిగా బదిలి అయ్యారు. రాధాకిషన్ రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో సిరిసిల్ల డీఈవోగా బాధ్యతలు స్వీకరించి ఆరున్నర ఏళ్లుగా సిరిసిల్ల జిల్లా లో పని చేశారు. మెదక్ డీఈవో గా పని చేస్తున్న ఏ.రమేశ్ కుమార్ సిరిసిల్ల డీఈవోగా బదిలి అయ్యారు. రాధాకిషన్ సిరిసిల్ల జిల్లా డీఈవోగా సమర్ధవంతంగా సేవలందించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆరున్నర ఏళ్లు సిరిసిల్ల డీఈవోగా సేవలందించిన డీఈవో రాధాకిషన్ను పలు ఉపాధ్యాయ సంఘాలు కలిసి.. విడ్కోలు పలికారు. ఆయన సేవలను కొనియాడారు. ఆరున్నర ఏళ్లుగా ఎలాంటి వివాదాలకు తావులేకుండా విధులు నిర్వర్తించిన డీఈవో రాధాకిషన్ను అభినందించారు. శుక్రవారం సిరిసిల్ల డీఈవోగా రీలీవ్ అయ్యారు. మెదక్ డీఈవోగా విధులు నిర్వహించిన ఏ.రమేశ్ కుమార్ రాజన్నసిరిసిల్ల జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.