అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం
  • కళ్యాణోత్సవంలో  పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

ముద్ర, షాద్ నగర్: శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉత్తర రామేశ్వరంగా పేరొందిన  శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంగళవారం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ కళ్యాణోత్సవానికి షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, అనురాధ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు  వీర్లపల్లి శంకర్ దంపతులకు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణోత్సవం అనంతరము  ఆలయంలోని  శ్రీ రామలింగేశ్వరుడుకి వీర్లపల్లి శంకర్ దంపతులు  అభిషేకాలను నిర్వహించారు.

ఆలయ అర్చకులు  శంకర్ దంపతులకు ప్రత్యేకంగా ఆశీర్వదించి శాలువాలతో సన్మానించారు. షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని శివయ్యను వేడుకున్నట్టు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. అంతకుముందు వీర్లపల్లి శంకర్ శ్రీ రామలింగేశ్వర ఆలయం ముఖద్వారాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్, కేశంపేట జడ్పిటిసిలు వెంకట్రాంరెడ్డి, విశాల శ్రవణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహన అధికారులు శ్రీనివాసరాజు, నరేందర్, అర్చకులు ప్రహ్లాదాచార్యులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు సుధాకర్ రావు, రవీందర్రావు, కిరణ్ కుమార్ రావు, రామేశ్వరం సర్పంచ్ సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రఘు, తిరుపతి రెడ్డి, సీతారాం  ఇతరులు పాల్గొన్నారు.