జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు

జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు
  • శివనామస్మరణతో మార్మోగిన వీపనగండ్ల

ముద్ర/వీపనగండ్ల:-మండలకేంద్రంలో శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు,ఈనెల 8 న మహాశివరాత్రి సందర్భంగా మండల దీక్ష,అర్ధ మండల దీక్ష స్వీకరించిన శివ స్వాములు దీక్షావిరమణ సమయంలో జ్యోతిర్ముడిని శ్రీశైలంలో సమర్పిస్తారు.శనివారం తెల్లవారుజామున శివాలయం లో రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించి,అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని, గ్రామం నుంచి శివ స్వాములు శ్రీశైలం కు పాదయాత్ర గా బయలుదేరారు.  గ్రామంలోని  శివ భక్తులు శివనామస్మరణతో ఊరేగింపుగా గ్రామం వెలుపల వరకు వెళ్లి శివ స్వాములకు వేడుకలు పలికారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివ భక్తులు, చిన్నారులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.