- పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి.
- మెట్ పెల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
మెట్ పల్లి, ముద్ర: మెట్ పెల్లి పట్టణంలో మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.గురువారం రోజున మెట్ పెల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పనుల వసూలు, ఎల్ఆర్ఎస్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31 వరకు ఉన్న గడువులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం.గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ ఉపయోగించుకొని అందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి ఎవరైతే ఫ్రీ చెల్లించి రెగ్యులర్ చేసుకుంటారో వారికి వెంటనే సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది అన్నారు.పట్టణంలోని వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అత్యధిక బకాయిలు ఉన్న వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం,ఇంకా చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘ చట్టం – 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.పట్టణ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని,అందరూ తమ ఆస్తి పన్నులను మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.100% పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్,బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు.మెట్ పెల్లి పట్టణ శివారులో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ స్థలం సేకరణ పనులను ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.ప్రజలకు అనుగుణంగా ఉండే స్థలం లో నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ వెంట, ఆర్డీవో శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ మోహన్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.