జ్వరాలతో అల్లాడుతున్న కుటుంబాలకు ఆసరా

జ్వరాలతో అల్లాడుతున్న కుటుంబాలకు ఆసరా

 కోదాడ, ముద్ర: మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో జ్వరాలతో అల్లాడుతున్న కుటుంబాలకు ఆసరా కోసం దొంతగాని సత్యనారాయణ రాములమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారులు దొంతగాని అప్పారావు ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బోసు బాబు మాట్లాడుతూ  కాపుగల్లు గ్రామంలో అనేకమంది విష జ్వరాల బారినపడి అనేక మంది ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దొంతగాని అప్పారావు దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన మానవత్వంతో సహకరించారని హైదరాబాదు నుండి విచ్చేసి గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.

అనంతరం దొంతగాని అప్పారావు మాట్లాడుతూ వ్యాధికి కాపుగల్లు పిహెచ్సి నుండి అనేక సేవలు అందిస్తున్నారు అన్నారు. ఫ్రూట్స్ బ్రెడ్ ఖర్జూరాలు ఓ ఆర్ ఎస్ ఆరోగ్యం ఉండేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెలదీ పద్మావతి, నాయకులు జిల్లా బోసు బాబు, వీరబాబు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.