చేపల పెంపకంలో ఆంధ్రాను మించి పోయాం

  • వారికే సొంతం అనుకున్న రికార్డ్ ను బ్రేక్ చేశాం
  • తెలంగాణా ఏర్పాటుతోటే చెరువులకు నీరు
  • ఆ నీటితోటే ఈ చేపల పెంపకం
  • దాసాయిగూడెంలో పెరిగిన చేప తెలంగాణా అభివృద్ధి కి సంకేతం
  • రాష్ట్రమే ఏర్పడకుంటే ఇక్కడ చేపల పెంపకం సాధ్యమా
  • సూర్యాపేట జిల్లా లో మృగశిర కార్తె సంబురం.
  • చేపలను పట్టుకుని మురిసిపోయిన మంత్రి
  •  మత్స్యకారుల  తో మంత్రి జగదీశ్ రెడ్డి మాటా.. మంతీ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: నిత్యం ప్రజా సేవ తో బిజీగా ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేరువు వద్ద సందడి చేశారు. సూర్యాపేట రూరల్ మండలం లో పలు క్కార్యక్రమాలకు హాజరై తిరుగు ప్రయాణం లో దాసాయు గూడెం చెరువు వద్ద మత్స్య కారులు చేపలు పట్టడాన్ని గమనించి కాన్వాయ్  దిగారు.. వెంటనే చెరువు వద్ద కు హుటా హుటీన వెళ్లిన మంత్రి , మత్యకార సోదరులు చేపలు పట్టడాన్ని ఆసక్తి గా గమనించారు. వారు పట్టిన కొరమేను చేపలను చేతిలో పట్టుకుని మురిసి పోయారు. తమను చూసి వచ్చిన మంత్రి ని చూసిన మత్స్యకార సోదరులు ఆనందం  లో మునిగిపోయారు.   గతంలో చెరువు లలో నీరు లేక  చేపలు ఉండేవి కావని, దీంతో కుల వృత్తి నే నమ్ముకుని జీవనం సాగించే  మేము చాలా ఇబ్బందులు పడినామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం  వచ్చాక మా తలరాతలు మారాయని అన్నారు.  ప్రభుత్వ సహకారం తొ  చెరువు లే కాకుండా కుంటలలో సైతం   మత్స్య సంపద పెరిగి మాకు చేతి నిండా ఉపాధి దొరుకుతుందని తెలిపారు.. మంత్రి మాట్లాడుతూ చేపల పెంపకంలో ఆంధ్రాను మించి పోయాం అన్నారు. కేసీఆర్ ముందు చూపు  తో 2014 వరకు ఆంధ్ర వారికే సొంతం అనుకున్న రికార్డ్ ను బ్రేక్ చేశాం అన్నారు. తెలంగాణ లో నీలివిప్లవం వచ్చిందనడానికి మత్స్య సంపద లో దేశం లో నే తెలంగాణ నంబర్ వన్ కు స్థానానికి  చేరుకోవడమే నిదర్శనం అన్నారు.తెలంగాణా ఏర్పాటుతోటే చెరువులకు నీరు .ఆ నీటితోటే ఈ చేపల పెంపకం సాధ్యపడింది అన్నారు.తెలంగాణ చెరువుల లో పెరిగిన చేప తెలంగాణా అభివృద్ధి కి సంకేతం అన్నారు.రాష్ట్రమే ఏర్పడకుంటే ఇక్కడ చేపల పెంపకం సాధ్యపడేది కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.