స్వప్నలోక్ ఘటన దురదృష్టకరం మంత్రి ఎర్రబెల్లి 

స్వప్నలోక్ ఘటన దురదృష్టకరం మంత్రి ఎర్రబెల్లి 

ముద్ర ప్రతినిధి, వరంగల్ : హైదరాబాదులోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన వాళ్ళందరికీ మంత్రి  నివాళులర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. ఆయా కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి అన్నారు.