రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరింది...అందుకే  ఉపసంహరణ

రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరింది...అందుకే  ఉపసంహరణ

రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరిందని, అందుకే ఆ నోట్లను ఉపసంహరించుకున్నామని ఆర్​బీఐ గవర్నర్​ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికే రూ. 20 వేల నోటు తెచ్చామని అన్నారు. ప్రజలకు త్వరగా డబ్బులు అందాలని చూశామని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అన్నారు. రూ. 2 వేల నోట్ల స్థానంలో సరిపడా ఇతర నోట్లు ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెయ్యి రూపాయల నోట్​ తీసుకొచ్చే ఆలోచన లేదన్నారు. రూ. 2 వేల నోట్లలో  భద్రతా లోపాలు లేవని చెప్పారు.