రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరింది...అందుకే ఉపసంహరణ
![రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరింది...అందుకే ఉపసంహరణ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646b3308e2f3f.jpg)
రూ. 2 వేల నోట్ల లక్ష్యం నెరవేరిందని, అందుకే ఆ నోట్లను ఉపసంహరించుకున్నామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికే రూ. 20 వేల నోటు తెచ్చామని అన్నారు. ప్రజలకు త్వరగా డబ్బులు అందాలని చూశామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రూ. 2 వేల నోట్ల స్థానంలో సరిపడా ఇతర నోట్లు ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెయ్యి రూపాయల నోట్ తీసుకొచ్చే ఆలోచన లేదన్నారు. రూ. 2 వేల నోట్లలో భద్రతా లోపాలు లేవని చెప్పారు.