గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిన టీడీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డపడ్డ టీడీపీ. ప్రాజెక్టుల అంశానికి వ్యతిరేకంగా సభ్యుల నినాదాలు చేశారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల్లో పురోగతి. 54 ఇరిగేషన్ ప్రాజెక్టల్లో 14 పూర్తి చేశామన్న గవర్నర్. గవర్నర్ వ్యాఖ్యలతో సభలో పలుమార్లు నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. అసత్యాలు భరించలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానుల అంశం. ఇప్పటివరకు ప్రతి ప్రసంగంలో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై ప్రస్తావించారు. త్వరలోనే విశాఖ వెళతానంటూ చెబుతూ వస్తున్న సీఎం జగన్. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి సుప్రీం కోర్టు విచారణే కారణమని చెబుతున్న న్యాయనిపుణులు.