దేశంలోనే మహోన్నతంగా రూపొందనున్న తెలంగాణ క్రీడా పాలసీ
జాతీయ స్థాయి అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : దేశంలోనే మహోన్నతంగా తెలంగాణ లో క్రీడా పాలసీ రానుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో గ్రామాల లో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తేలిపారు.
గురువారం మొయినాబాద్ లోని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని జ్వాల గుత్త అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంబించారు. దేశం లోని 33 రాష్ట్రాల నుంచి 560 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాలు పంచుకుంటున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు దేశంలోనే మహోన్నతంగా తెలంగాణ లో క్రీడా పాలసీ రానుందని, తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందనీ అన్నారు గతంలో పీవీ సింధు, సానియా మీర్జా లాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహించిందనీ అయన గుర్తు చేసారు. రాష్ట్రం కొత్తది క్రీడా పాలసీ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం పలు అంశాలను చర్చించారనీ అయన వెళ్ళడించారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాఠ్యాంశాలలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామణి మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమములో జ్వాలా గుత్త, బారత జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బిస్వా, కోశాధికారి వంశి, సాఫ్ ఎండీ లక్ష్మి తడితరులు పాల్గొన్నారు.