తుర్కపల్లిలో రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

తుర్కపల్లిలో రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర, తుర్కపల్లి : భారత రత్న మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ  79 వ జయంతి సంధర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, మొతిరాం తండా సర్పంచ్ బానోత్ బిచ్చునాయక్, ముల్కలపల్లి ఎంపిటిసి ధీ రావత్ ప్రతిభా రాజేష్ నాయక్లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో ఉన్న ప్రజలు, యువత కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం స్థానిక ఆసుపత్రులలో రోగులకు పండ్లను పంపణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డమీది యాదగిరి, కోట సురేష్, బండారి యాదగిరి యువజన కాంగ్రెస్ మండల నాయకులు పసుల సత్యనారయణ యాదవ్, బండారి శ్రీనివాస్ పిడుగు రమేష్, కోట భాస్కర్, మహేష్ నాయక్, మహేందర్ నాయక్ దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ మోతీరాంతండా గ్రామాల వార్డు సభ్యులు జేరి పోతుల చంద్రయ్య, గుజ్జుక బాలకృష్ణ, వెంకటేష్ నాయక్, నరేష్ నాయక్, రమేష్ నాయక్ మహేష్ నాయక్ పాల్గొన్నారు.