ఎల్లవేళలా జర్నలిస్టులకు అండగా నిలిచిన శ్రీనాథ్- అమర్  నివాళి

ఎల్లవేళలా జర్నలిస్టులకు అండగా నిలిచిన శ్రీనాథ్- అమర్  నివాళి

కడప: ఇటీవల కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్,  సిఆర్ ప్రెస్ అకాడమీ ఆఫ్ ఏపి మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సంస్మరణ సభ కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఈ సమావేశానికి హాజరై  శ్రీనాథ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జర్నలిస్టులకు శ్రీనాథ్  అన్ని విధాలుగా అండగా నిలిచారని అన్నారు. రాయలసీమ ఉద్యమ సమయంలో కూడా ప్రముఖ పాత్ర వహించారని, ఆయన లేని ఇలాంటి సందర్భం వస్తుందనుకోలేదని గద్గద స్వరంతో అమర్ అన్నారు.  వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నానని అమర్ ప్రకటించారు.

ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ కె. రామచంద్రమూర్తి, స్ధానిక ప్రజా ప్రతినిదులు, మీడియా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు