మంచిర్యాల లో అమరవీరుల కు నివాళులు

మంచిర్యాల లో అమరవీరుల కు నివాళులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల బైపాస్ రోడ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దశాబ్ది ఉత్సావాల సందర్భంగా తెలంగాణ ఉద్యమం అమరవీరుల స్మారక స్తూపంకు పూలమాలలు వేసి అంజలిఘటించారు. రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమరుల త్యాగం , ఆత్మార్పణ వల తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు.