జిల్లాకి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం కానుకలు: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. శ్రీనివాస్ రావు

జిల్లాకి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం కానుకలు: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. శ్రీనివాస్ రావు

ముద్ర సిరిసిల్ల టౌన్; రంజాన్ మాసము మరియు పండుగ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం 2023 సంవత్సరమునకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుకలు (గిఫ్ట్ ప్యాకెట్స్) బీద ముస్లింలకు రంజాన్ పండుగ వారం రోజుల ముందు ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గిఫ్ట్ ప్యాకెట్స్ కి సంబందించిన స్టాక్ ఇప్పటికే జిల్లా కి చేరింది అని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గానికి ఒక్కో నియోజకవర్గానికి 1500 గిఫ్ట్ ప్యాకెట్స్ మరియు ఇఫ్తార్ దావతు ఇచ్చేందుకు నియోజకవర్గానికి రూ.3.00 లక్షల చొప్పున మంజూరు చేయనైనది అని తెలిపారు.