కాంగ్రెస్ హయాంలో సంక్షేమం.. డీసీసీ అధ్యక్షరాలు సురేఖ

కాంగ్రెస్ హయాంలో సంక్షేమం.. డీసీసీ అధ్యక్షరాలు సురేఖ

ముద్ర, ప్రతినిధి, నస్పూర్ (మంచిర్యాల): కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమంకు బీజం పడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శనివారం హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో సురేఖ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రజలకు మంచిరోజులు వస్తాయని ఆమె భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను  మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.