111 జీవో రద్దు తో రియల్ మాఫియా పెరిగే అవకాశం

111 జీవో రద్దు తో రియల్ మాఫియా పెరిగే అవకాశం

111 జీవో రద్దు తో రియల్ మాఫియా పెరిగే అవకాశం

ఈ జీ వో రద్దు నిర్ణయాన్ని  విరమించుకోవాలి

రైతుల కొంపలు ముంచుతున్న ధరణి

బీజేపీ లో నాకు పదవులు కావాలని ఏ నాడూ అడగలేదు

కే సీ ఆర్ కు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు

కే సీ ఆర్ సర్కారు పై విరుచుకుపడ్డ బీజేపీ నేత ఈటల రాజేందర్

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: తన మంది మాగాధులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చడం కోసమే కే సీ ఆర్  111 జీవో ను రద్దు చేశాడని బీ జే పీ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు వేల కోట్ల డబ్బు అక్రమంగా రాబట్టడం కోసమే 111 జీవో రద్దు కు తెర లేపారు అని ఆయన దుయ్యబట్టారు.111 జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న 1.32 లక్షల ఎకరాల్లో 18వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చాటున పర్యావరణ విధ్వంసం చేస్తారా కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. మీ తీరుతో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ కాబోతోంది . వరదలు వస్తె పడవలేసుకుని తిరిగే పరిస్థితులు ఉన్నాయి. వెంటనే 111జీవో రద్దును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వరదలకు అస్కారం లేకుండా జంట జలాశయాలకు విఘాతం కలగకుండా రైతులకు మేలు చేసే విధంగా పాలన ఉండాలని ఈటల కేసీఆర్ కు సూచించారు.

కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతుల కొంపలు ముంచిందన్నారు. ధరణి సమస్యల వల్ల రైతులు ఆగం అవుతున్నారని ధరణిలో 18లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పేదలకు సెంటు భూమి ఇవ్వలేదన్నారు. రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న దళిత రైతుల 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఎకరాకు 300 గజాలు ఇచ్చి పేదల భూములను లాక్కున్నారు. కోర్టులకు పోలేక రైతులు బ్రోకర్లకు భూములు అమ్ముకునే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని ఈటల అన్నారు.

ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు భయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.తెలంగాణ సొమ్ముతోనే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నాడంటూ ఈటల  ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ప్రతినిధులకు స్థానం లేదు, మీడియాకు స్థానం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరిక వ్యవస్థనా కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.