ముదిరాజుల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలి...ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రాజు

ముదిరాజుల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలి...ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రాజు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ముదిరాజుల సమగ్ర అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ నీల రాజు అన్నారు. జనగాం జిల్లా చిల్పుర్ మండలం కొండాపూర్ లో ఆదివారం ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా డైరెక్టర్ నీల రాజు మాట్లాడుతూ జాతి సమగ్రాభివృద్ధి కొరకు మనమంతా ఐక్యతతో పని చేయాలని,మన ఐకమత్యమే మనకు మహబలం తద్వార రాజ్యాధికారం సంపాదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కార్యదర్శి గోరంట్ల యాదగిరి, మండల నాయకులు ఉరడి శ్రీనివాస్, యాకరాజ్, కొండాపూర్ ఉప సర్పంచ్ సంపత్, నాయకులు పులికాషి రాజయ్య, నరేష్, రవి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.