నిన్న కాంగ్రెస్ లో.. నేడు బీఆర్ఎస్ లో..

నిన్న కాంగ్రెస్ లో.. నేడు బీఆర్ఎస్ లో..

ఖంజాపుర్ మహిళలు బీ ఆర్ ఎస్ కే సంఘీభావం 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాండూరు మండలం ఖాంజాపూర్ మహిళలతో  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మాతృమూర్తి ప్రమోదిని , సతీమణి ఆర్తి రెడ్డి లు శని వారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరగా.. వారందరూ తమ పూర్తి మద్దతు రోహిత్ రెడ్డికే అంటూ నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు తిరిగి బీ ఆర్ ఎస్ కు సంఘీభావం తెలిపేందుకు ఎఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటికి చేరుకునడం విశేషం.