అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి: సుచిత్ర ఎల్ల

అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి: సుచిత్ర ఎల్ల

విశాఖ:తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా భావించి సదస్సు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో సుచిత్ర ఎల్ల మాట్లాడారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. పలు కీలక రంగాల్లో ఏపీ పటిష్ఠంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని సుచిత్ర ఎల్ల అన్నారు. సమ్మిళిత కృషి కోసం ఏసీ సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు.