ముద్ర, తెలంగాణ బ్యూరో : మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి వచ్చే ద్వైవార్షిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.