Take a fresh look at your lifestyle.

ఏపీ బడ్జెట్ హైలైట్స్

  • వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
  • పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.

బడ్జెట్ హైలైట్స్:

  • మొత్తం బడ్జెట్ – రూ. 3.22 లక్షల కోట్లు
  • రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
  • మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
  • రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
  • ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు
  • వ్యవసాయానికి – రూ. 48 వేల కోట్లు
  • పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,705 కోట్లు
  • అన్నదాత సుఖీభవకు – రూ. 6,300 కోట్లు
  • పాఠశాల విద్యకు – రూ. 31,805 కోట్లు
  • ఉన్నత విద్యకు – రూ. 2,506 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ. 1,228 కోట్లు
  • బీసీ సంక్షేమానికి – రూ. 47,456 కోట్లు
  • ఎస్సీ సంక్షేమానికి – రూ. 20,281 కోట్లు
  • ఎస్టీ సంక్షేమానికి – 8,159 కోట్లు
  • అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ. 5,434 కోట్లు
  • పంచాయతీ రాజ్ శాఖకు – 18,847 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ. 13,862 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు – రూ. 6,318 కోట్లు
  • జలవనరుల శాఖకు – రూ. 18,019 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం – రూ. 4,332 కోట్లు
  • ఆర్ అండ్ బీ కి – రూ. 8,785 కోట్లు
  • ఇంధన శాఖకు – రూ. 13,600 కోట్లు
  • తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ. 10 కోట్లు.
  • దీపం 2.0 పథకానికి – రూ. 2,601 కోట్లు
  • తల్లికి వందనం కోసం – రూ. 9,407 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు – 3,806 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ. 13,487 కోట్లు
  • జల్ జీవన్ మిషన్ కు – రూ. 2,800 కోట్లు
  • మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ. 10 కోట్లు
  • మత్స్యకార భరోసాకు – రూ. 450 కోట్లు
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 3,486 కోట్లు
  • ఆదరణ పథకానికి – రూ. 1,000 కోట్లు
  • ఆర్టీజీఎస్ కోసం – రూ. 101 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు – రూ. 27,518 కోట్లు.

Leave A Reply

Your email address will not be published.