- వైభవంగా నిత్యకల్యాణం
ముద్ర యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో ఆదివారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా నిత్య కళ్యాణం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి,సహస్రనామార్చన,సుదర్శన హోమం, వేద మంత్రయుక్తంగా నిర్వహించారు.అనంతరం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో ఆలయ అర్చకులు చదివే పంచ సూక్తాలు ,ఉపనిషత్తులు దశ శాంతులతో సుమారు రెండు గంటల పాటు అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలను ధరింపజేశారు.వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. సుదర్శన హోమంలో లక్ష్మి, గరుడ, ఆంజనేయం, సుదర్శనం,వంటి దేవత మూల మంత్రాలతో హవనం నిర్వహించారు.అలాగే సాయంత్రం వెండి జోడు సేవలు నిర్వహించారు.