రాజమౌళి–మహేష్బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’లో నాలుగు భారీ యాక్షన్ బ్లాక్స్ హైలైట్గా నిలవనున్నాయి. ఒక్కో లొకేషన్లో కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సీన్స్లో ఒకటి రామాయణ నేపథ్యంతో మైండ్బ్లాక్ చేసే స్థాయిలో ఉంటుందన్న టాక్.
ఫస్ట్ హాఫ్లో రెండు, సెకండ్ హాఫ్లో రెండు యాక్షన్ ఘట్టాలతో పక్కా స్క్రీన్ప్లే సిద్ధం చేసిన జక్కన్న, ‘రుద్ర’ పాత్రలో మహేష్బాబును పూర్తిగా కొత్తగా చూపించనున్నాడు. 1000 కోట్లకు పైగా బడ్జెట్, ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్లో విడుదలకానుంది.