ముద్ర ప్రతినిధి, నిర్మల్:
హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు. గో రక్షా సమితి ఆధ్వర్యంలో వివిధ మండలాలనుండి వందలాది మంది సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. గో రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, గో వధను నిషేధించాలని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో శాంతిలాల్ పటేల్, నూకల విజయ్ కుమార్, దోముడాల ప్రవీణ్, గిల్లి విజయ్, దేవిదాస్ తదితరులున్నారు.