ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డిఇఓ రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సాపూర్ జి ఉన్నత పాఠశాలకు చెందిన మనోహర్ రెడ్డి, మోహన్ రావులతో పాటు ప్రధానోపాధ్యాయుడు మేచినేని కిషన్ రావులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.