మంథని, ముద్ర: ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77 వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో కళాకారులు ఘన నివాళి జోహార్లు అర్పించారు.శుక్రవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మంథని వెంకటస్వామి (ఢిల్లీ), దుబాస్ శ్రీనివాస్, చిలక సమ్మన్న, పులిపాక భావన, వడ్లకొండ రవి వర్మ, కోట మహేష్, నాగరాజు, మడిపల్లి దేవా, గొరింకల సురేష్ అంజలి, స్వరూప కార్యక్రమంలో ఉన్నారు.