మంథని : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని పట్టణంలో ప్రెస్క్లబ్ భవన నిర్మాణ నిధులు ఇప్పిస్తానని , ప్రెస్క్లబ్ సభ్యులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, కోశాధికారి తగరం రాజు, సభ్యులు ఉన్నారు.