Take a fresh look at your lifestyle.

రాష్ట్ర గవర్నర్ తో బీసీ సంఘాల భేటీ

  • బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినందుకు  ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాల నేతలు .
  • దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్న ప్రధాని కి కృతజ్ఞతలు.
  • బిల్లు ఆమోదం పొందేలా కేంద్రo  తో మాట్లాడాలని గవర్నర్ ను  కోరిన బీసీ నేతలు.
  • జాతీయ స్థాయిలో కులగణన చేస్తామన్న కేంద్రం ముందుగా తెలంగాణలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్ట రూపం తీసుకురావాలి.
  • బీసీల పోరాట ఫలితంగానే కేంద్రం కులగననకు ఒప్పుకుంది.
  • 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాo.
  • గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. 
ముద్ర, తెలంగాణ బ్యూరో: బీసీల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  ఎలాంటి సవరణలు లేకుండా యధావిధిగా ఆమోదించి రాష్ట్రపతికి పంపించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ సంఘాల ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఆయనను కలిసి  అభినందించారు.ఈ సందర్భంగా గవర్నర్ ను బీసీ సంఘాల నేతలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు .రాష్ట్రంలో జరిగిన కులగనణ, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా చేసిన బీసీ బిల్లు, అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలలో సమగ్ర కులగణను చేపట్టాలని నిర్ణయించడం తదితర అంశాలపై గవర్నర్ తో జరిగిన భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు జాజుల  వెల్లడించారు.ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్యాబినెట్ కూడా గవర్నర్ ద్వారా బీసీ ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపినట్లు వారు తెలిపారు గత నెల 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన మహా ధర్నాలో 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాల్గొనడంతో దేశస్థాయిలో కులగనన అంశం తీవ్రంగా చర్చకు వచ్చిందన్నారు.దేశంలో తెలంగాణ. బీహార్ లో జరిగిన కుల గణనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. కుల గణ న చేయమని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా అఫిడవిట్లు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం నేడు కుల గణన చేస్తామని వెల్లడించడం ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేసినందున కేంద్ర ప్రభుత్వం కుల గణన పట్ల సానుకూల వైఖరి ఉందని తాము అనుకుంటున్నామని ఒకవేళ కులగణణ పై సానుకూల వైఖరి ఉంటే తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును తక్షణమే ఆమోదించి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.ఇటీవల తమిళనాడు కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ బిల్లు కూడా మూడు నెలల్లోనే తేల్చాల్సిన బాధ్యత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చన సరే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని లేకుంటే మరొక సారి ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించక తప్పదని ఆయన హెచ్చరించారురాష్ట్రంలో బీసీ ఉద్యమం రోజురోజుకు బలపడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ తమ విశిష్ట అధికారాలను ఉపయోగించి 42 బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా, అలాగే దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా చూడాలని కోరారు. అలాగే కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.గవర్నర్ ను కలిసిన వారిలో  బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు  ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.