- రైల్వే సిబ్బంది తిరంగా యాత్రలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమానికి గౌరవ సూచికగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను త్రివర్ణపతాక రంగులతో అలంకరించారు. రైల్వే సిబ్బంది తిరంగా యాత్రులు( జెండా కవాతులు) నిర్వహించారు. దేశ ధైర్య సైనికుల పట్ల తన ప్రగాఢ కృతజ్ఞతను తెలియజేయడానికి భారత రైల్వేలు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు, భారతదేశం అంతటా స్టేషన్లు దేశభక్తి స్ఫూర్తి యొక్క ప్రత్యేక తిరంగాన్ని చూశాయి. త్రివర్ణ పతాకం శక్తివంతమైన రంగులతో దేశభక్తి దృశ్యాలు సజీవంగా నిలిచాయి. భారతీయ రైల్వేలు సింధూర్ విజయ గాథను ప్రతి పౌరుడి దగ్గరకు తీసుకెళ్లడానికి, దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరంగ యాత్రలను నిర్వహించాయి. ఈ కవాతులు ప్రజల జాతీయ భావాన్ని, సాయుధ దళాల పట్ల గౌరవాన్ని మరింత బలోపేతం చేశాయి.యాత్రలకు అనుబంధంగా, అనేక రైల్వే స్టేషన్లలో ప్రభావవంతమైన వీధి నాటకాలు (నుక్కడ్ నాటకాలు) ప్రదర్శించించారు.ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తి ప్రాముఖ్యతను ప్రజలకు దగ్గరగా శక్తివంతమైన రీతిలో తీసుకెళ్ళాయి.
