- క్లింకార ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
ముద్ర, ఇబ్రహీంపట్నం: విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం అలవర్చుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. సోమవారం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో క్లింకార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ గుడివాక లక్ష్మి,ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ లతో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో తాము ఎంచుకున్న రంగాల్లో ఉత్తమంగా రాణించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో క్రీడా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హిర్య నాయక్, రిటైర్డ్ ఆర్మీ, అభిమన్యు యూత్ అధ్యక్షుడు ఎడమ విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు అచ్చన శ్రీశైలం, జ్యోతి భాస్కర్ రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.