రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : కలిసిమెలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుని కుటుంబానికి తోటి స్నేహితులు గురువారం ఆర్థిక చేయూతనందించారు. స్నేహితుని తండ్రి గుర్రం పొషం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశ దినకర్మ కోసం మిత్రులంతా కలిసి 14 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు.అలాగే మాల సంఘం ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యాన్ని ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్,దేవి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు శుక్రవారం అందించారు.
