- బి.ఆర్.ఎస్.యూత్ వైస్ ప్రెసిడెంట్ పింజరి హరీష్.
మెట్ పల్లి, ముద్ర: మండలం లోని మేడిపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14వ తేదీన గ్రామపంచాయతీ అధికారికంగా ఘనంగా నిర్వహించాలని శుక్రవారం మేడిపల్లి గ్రామ పంచాయతీ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవళిక కు వినతిపత్రం అందజేసారు.అనంతరం పింజరి హరీష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు దళిత సంఘాలు రాజ్యాంగ పరిరక్షణ సమితి తదితర ప్రజాస్వామ్య వాదులతో ప్రభుత్వ అధికారుల సమక్షంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని అన్నారు.