Take a fresh look at your lifestyle.

భార‌త ప్ర‌యాణీకులకు మ‌లేసియా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఛార్జీలు

 

ముద్ర, హైదరాబాద్ :

భార‌త్‌లోని ప్ర‌యాణీకుల కోసం మ‌లేసియా ఎయిర్‌లైన్స్ ఈ నెల 10 నుంచి 23 వ‌ర‌కు ప్ర‌త్యేక ఛార్జీల‌ను ప్ర‌క‌టించింది. దాదాపు రూ. 20,5999 నుంచి ప్రారంభ‌మ‌య్యే ప్ర‌త్యేక ఆల్ ఇన్ రిట‌ర్న్ ఛార్జీల‌కు (తిరుగు ప్ర‌యాణానికి వ‌ర్తించే అన్ని ప‌న్నులు, రుసుములు, స‌ర్‌ఛార్జీలు స‌హా క‌లిగిన తుదిమొత్తం) ఎకాన‌మీ క్లాస్‌కు ప్ర‌క‌టించింది. బుకింగ్‌లు 23 మార్చి 2026వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని, ఇది 18 డిసెంబ‌ర్ 2026 వ‌ర‌కూ చెల్లుబాటు అవుతుంద‌ని సంస్థ పేర్కొంది. ఆసియా, దాని ఆవ‌ల‌కు ద్వారంగా, కౌలాలంపూర్, సింగ‌పూర్, ఆక్లాండ్‌, సిడ్నీ స‌హా మ‌రిన్ని గ‌మ్య‌స్థానాల‌కు స‌జావైన అనుసంధాన‌త‌ను ప్ర‌యాణీకులు అనుభ‌వించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక చార్జీల‌కు అద‌నంగా, సెబు, క్రాబికు ఫైర్ ఫ్లై కొత్త‌గా ప్రారంభించిన సేవ‌లు స‌హా నూత‌న మార్గాల‌ను ఆఫ‌ర్ చేయ‌డం ద్వారా పెరిగిన అనుసంధాన‌త ప‌ట్ల ప్ర‌యాణీకుల దృష్టిని ఆక‌ర్షించ‌డం ఈ ప్ర‌చార ల‌క్ష్యం. విశ్రాంతి, స్వల్ప-దూర విహారయాత్రలకు మరిన్ని ఎంపికలతో, బుకింగ్ కాలంలో ప్రయాణికులకు ఎక్కువ ఎంపిక, సౌలభ్యం, పోటీ ధరలను అందించాల‌న్న నిబ‌ద్ధ‌త‌ను ఈ సేల్ బలోపేతం చేస్తుంది. ఈ బుకింగ్ పరిమిత కాలం మాత్ర‌మే అందుబాటులో ఉన్నందున‌, ప్ర‌యాణీకులు ముంద‌స్తుగా ప్ర‌ణాళిక వేసుకుని, త‌మ భ‌విష్య‌త్ ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌ల‌ను ముందస్తుగా ఖ‌రారు చేసుకోమ‌ని సంస్థ కోరింది. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

Leave A Reply

Your email address will not be published.