Take a fresh look at your lifestyle.

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

  • అధికారులు అలసత్వం వహించొద్దు.
  • రంగారెడ్డి ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కాగా, ప్రజా వాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 25 కలిపి మొత్తం 46 దరఖస్తులు అందాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.