ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల కె రూ.20 లక్షలతో రెండు సెల్ఫ్ హెల్ప్ బృంద భవనాల నిర్మాణానికి, రూ. 20 లక్షలతో రెండు వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూ. 5 లక్షలతో మాల సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమాల్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, గంగారెడ్డి, సర్పంచ్ రాజు, నాయకులు ముని, ముత్యం, శ్రీధర్, రమణ రెడ్డి, రాజన్న, తో పాటు మండల నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.