Take a fresh look at your lifestyle.

ముమ్మరంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు,అన్నీ తానై పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: మార్చ్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘ రెడ్డి ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆయన పాలిటెక్నిక్ లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ దగ్గరుండి పర్యవేక్షించారు.అలాగే జన సమీకరణకు సంబంధించి ఆయా మండలాల నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాట్లకి సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేస్తూ మొదటిసారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి రాక సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కార్యక్రమం,ముఖ్యమంత్రి అద్దెకుండి విద్యాభ్యాసన చేసిన పార్వతమ్మ ఇంటి పరిశీలన,క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు,జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను,ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి ఎనుముల రేవంత్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్ట నాయకులు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.