Take a fresh look at your lifestyle.

తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల .. వివరాలివే!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 11 – నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13 – ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల జరగనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం,ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.