రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పుర పరిధిలోని 21 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బోడ సారయ్యకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రాజు ఆర్థిక చేయూతనందించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సారయ్యకు పదివేల రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తం మంగళవారం అందించారు. సునీత, వెంకటస్వామి, వేణు, రామస్వామి, సురేందర్, రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు.