Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కార్యాలయంలో మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  • వార్డ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
  • రాబోయే వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు
  • 100 శాతం ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ వసూలు చేయాలి
  • పెద్దపల్లి పురపాలక భవనం తనిఖీ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్.ఆర్.ఎస్,ట్రెడ్ లైసెన్స్,వివిధ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని పురపాలక భవనాన్ని తనిఖీ చేశారు.పురపాలక భాగంలోని ప్రతి సెక్షన్ ను కలెక్టర్ పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్.ఆర్.ఎస్, ట్రేడ్ లైసెన్స్ మేళాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో 100 శాతం ఆస్తి పన్ను,ట్రెడ్ లైసెన్స్ రెన్యూవల్స్ వసూలు పూర్తి చేయాలని అన్నారు. వార్డు అధికారులు మున్సిపల్ చట్టాల పై అవగాహన పెంచుకోవాలని క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.రాబోయే వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు లేకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్,మేనేజర్ శివప్రసాద్,ఏ ఈ సతీష్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.