సీఆర్ ఫౌండేషన్ కొండాపూర్ లోని నీలం రాజశేఖర రెడ్డి పరిశోధన కేంద్రం లో ఉన్న సురవరం సుధాకర రెడ్డి లైబ్రరీ ని తెలంగాణ స్టేట్ యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ , ప్రధాన కార్యదర్శి శ్రీ సమద్ ఖాన్, కె . రవీంద్ర బాబు (ఆస్ట్రేలియ) సందర్శించారు.
పరిశోధన కేంద్రం , లైబ్రరీ కార్యకలాపాల గురించి పరిశోధన కేంద్రం కమిటీ సభ్యులు డా. బివి విజయ లక్ష్మి , కన్వీనర్ కంభంపాటి అజయ్ కుమార్ , లైబ్రరీ ఇన్-ఛార్జ్ శ్రీ జి. రాజగోపాల్ రెడ్డి , శ్రీమతి. కె. జ్యోత్స్న వివరించారు.
లైబ్రరీ కి మరిన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచటానికి వీలుగా రవీంద్రనాథ్ గారు, సమద్ గారు వారి యూనియన్ తరుపున రూ 25 వేలు చెక్కు రూపములో విరాళం అందించారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ ప్రముఖ అభ్యుదయ రచయిత శ్రీ. ఏటుకూరి ప్రసాద్ గారు కూడా రూ. 40 వేలు పుస్తకాల కోసం విరాళం అందించారని డా. విజయ లక్ష్మి గారు తెలియచేసి, ఈ విరాళం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.