తుర్కపల్లి,ముద్ర: తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు గ్రామంలోని యువకులు కలిసి గద్దెను నిర్మించారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శివాజీ విగ్రహం కోసం ఏర్పాటుచేసిన గద్దెను పూర్తిగా భూస్థాపితం చేశారు.అక్కడ ఉన్న మెటీరియల్ను కూడా ఎత్తుకెళ్లారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే కూల్చి వేసి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.